చివరి వన్డే: రోహిత్‌, రహానే@ 50 | Sakshi
Sakshi News home page

చివరి వన్డే: రోహిత్‌, రహానే@ 50

Published Sun, Oct 1 2017 7:09 PM

IND vs AUS, 5th ODI updates: Rohit Sharma, Rahane notches  fifty

సాక్షి, నాగ్‌పూర్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, అజింక్యా రహానేలు ఆర్ధసెంచరీలతో దుమ్ములేపారు. తొలుత రోహిత్‌ 52 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో కెరీర్‌లో 35వ సెంచరీ సాధించాడు. మరికొద్ది సేపటికి రహానే 64 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.ఈ సిరీస్‌లో రహానేకు వరుసగా నాలుగో అర్ధసెంచరీ కాగా రోహిత్‌ మూడో అర్ధసెంచరీ. వీరిద్దరూ ఆచితూచి ఆడుతుండటంతో భారత్‌ 20 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 111 పరుగులు చేసింది.  
 

Advertisement
Advertisement